హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పుడే విభజన వద్దు: ఆంధ్ర మేధావులు

By Pratap
|
Google Oneindia TeluguNews

United Andhra
హైదరాబాద్‌: కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నీరు, విద్య, ఉపాధి వంటి సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆంధ్ర మేధావులు, విద్యావేత్తలు శ్రీకృష్ణ కమిటీకి చెప్పారు. సమస్యలను అలానే ఉంచి రాష్ట్రాన్ని విభజిస్తే ఆ రెండు ప్రాంతాలు అగ్నిగుండాలవుతాయని వారన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఉంచుతూ దేశ రెండో రాజధానిగా చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా ఉంచినా అభ్యంతరం లేదని తెలిపారు.

ఆంధ్రా మేధావులు, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ తోపాటు ప్రొఫెసర్‌ పి.ఎ.రామకృష్ణరాజు, జి.పాపారావు, బి.ఆర్‌.రావు, కె.తమ్మారెడ్డి, ఎస్‌కే మస్తాన్‌, కె.వెంకటేశ్వర్లు, ఎస్వీ నారాయణ, జీటీ నరసింహారావు, ఆర్వీఎస్‌ఎన్‌ రాజు గురువారం శ్రీకృష్ణ కమిటీ ముందు వారి వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన వల్ల రెండు ప్రాంతాల్లో తలెత్తే నీటి సమస్య గురించి ప్రొఫెసర్‌ రాజు శాటిలైట్‌ చిత్రాలతో వివరించారు. నీటి సమస్యపై ప్రత్యేకంగా ఇద్దరు నిపుణుల కమిటీ నియమించామని, వారితో సమావేశానికి త్వరలో ఆహ్వానిస్తామని జస్టిస్‌ శ్రీకృష్ణ తమకు చెప్పారని చలసాని శ్రీనివాస్‌ వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X