హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిదంబరం ప్రకటనపై నాగం చిటపటలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకాభిప్రాయం కావాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చిదంబరం ప్రకటనపై నాగం జనార్దన్ రెడ్డి, కడియం శ్రీహరి శుక్రవారం మీడియా సమావేశంలో తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏకాభిప్రాయం కావాలనుకున్నప్పుడు శ్రీకృష్ణ కమిటీని ఎందుకు వేశారని వారడిగారు.

శ్రీకృష్ణ కమిటీని వేసిన తర్వాత చిదంబరం అలాంటి ప్రకటన చేయడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ చేసిన తీర్మానాన్ని తమ పార్టీకి చెందిన కె. ఎర్రంనాయుడు రూపొందించారని, దాన్ని మరోసారి చదువుకుని దానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. ఆంధ్ర, తెలంగాణ కలిసినప్పుడు ఏకాభిప్రాయం ఉందా అని ఆయన అడిగారు. అప్పుడు లేని ఏకాభిప్రాయం ఇప్పుడెందుకని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X