గవర్నర్ నరసింహన్ తో రోశయ్య భేటీ

Rosaiah
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఎంఎల్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం సమావేశమయ్యారు. మంత్రి మండలి సభ్యులతో ముఖ్యమంత్రికి విభేదాలు పొడసూపాయని, ముఖ్యమంత్రి మంత్రులపై మండి పడ్డారని వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది. పరిస్థితిని ముఖ్యమంత్రి గవర్నర్ కు వివరించినట్లు సమాచారం.

కాగా, ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ స్థితిలో ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ కు వివరించినట్లు చెబుతున్నారు. అలాగే, ప్రజాపథం కార్యక్రమంపై ఆయన నరసింహన్ కు వివరించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+