కాంగ్రెసు తెలంగాణ నేతలది ఒకే మాట
శ్రీకృష్ణ కమిటీ ముందు వినిపించాల్సిన వాదనలు, ఎదురయ్యే ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ ప్రాంతంలో జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలా? వద్దా అనే అంశంతో పాటు ఎంపీ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్రపై సమావేశంలో చర్చించారు. చరిత్ర, రాజకీయం, సాంస్కృతిక, విద్య, సాగునీరు సహా ముఖ్య రంగాలపై వినిపించే వాదనలపై కసరత్తుచేశారు.శ్రీకృష్ణ కమిటీ ముందుకు వెళ్లే తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధుల బృందానికి కేకే నాయకత్వం వహించాలని కోరారు. కమిటీ ముందు పవర్పాయింట్ ప్రజేంటేషన్ కూడా కేకే ద్వారా ఇప్పించనున్నారు. సీడబ్ల్యుసీ సభ్యుడు కావడంతో కేకే కోసం కాంగ్రెసు అధిష్ఠానం నుంచి అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం లేఖను సిద్ధంచేసి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, హాజరైన ఎమ్మెల్యేల నుంచి సంతకాలు తీసుకున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని సమావేశంలో అభిప్రాయపడ్డారు.