హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య నేరంగా చూస్తున్నారు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: రైతు సమస్యలను విన్నవిస్తే తాము నేరం చేసినట్లుగా ముఖ్యమంత్రి కె. రోశయ్య చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే తప్పా అని ఆయన అడిగారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య అసమర్థత వల్లనే రైతుల సమస్యలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. నీటి పరిరక్షణపై గానీ భూగర్భ జలాల పరిరక్షణపై గానీ కాంగ్రెసు ప్రభుత్వానికి అవగాహన లేదని ఆయన అన్నారు.

రైతు సమస్యలపై ఇప్పటికైనా రోశయ్య ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఆయన సూచించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని తాను కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిాపరు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్రం సానుకూలంగా ప్రతిస్పందించిందని ఆయన చెప్పారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడంలో రాష్ట్ర పార్లమెంటు సభ్యులు విఫలమయ్యారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X