హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్ని చర్యలూ తీసుకున్నాం: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: రాష్ట్రంలో తుఫాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. తుఫాను పరిస్థితిపై ఆయన గురువారం మధ్యాహ్నం సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రానికి 9 హెలికాప్టర్లు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిపై ప్రధాని, హోంమంత్రి, సోనియా గాంధీతో మాట్లాడానన్నారు. అధికారులకు సెలవులు రద్దు చేశామని చెప్పారు. సహాయనిధులు ఉపయోగించేందుకు కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చామన్నారు. విపక్ష నేతలతో కూడా మాట్లాడానని చెప్పారు.

తుఫాను బాధిత ప్రాంతాలను గుర్తించామని ఆయన చెప్పారు. తీర ప్రాంతంలోని 73 మండలాల్లోలని 774 గ్రామాలు తుఫాను తాకిడికి గురయ్యాయని ఆయన చెప్పారు. తుఫాను తాకిడి ప్రాంతాల్లో 35 వేల ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ముప్పు ప్రాంతాల్లోని ప్రజలను బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X