హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలగాణపై మాదే ఆఖరు కమిటీ: దుగ్గల్

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
హైదరాబాద్: తెలంగాణపై తమదే చివరి కమిటీ అని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వినోద్‌కుమార్ దుగ్గల్ వెల్లడించారు. గత మూడు రోజులుగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం, టీఎన్‌ జీవో, తెలంగాణ టీచర్స్ సమాఖ్య, సిఐఐ, ఫ్యాప్సీ తదితర సంఘాల ప్రతినిధులు తమతో భేటీ అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న సందేహపరిస్థితిని త్వరగా తేల్చకుంటే పారిశ్రామిక ప్రగతి దెబ్బతినడంతో పాటు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని సిఐఐ, ఫ్యాప్సీ చెప్పడాన్ని దుగ్గల్ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సమర్థించారు.

కమిటీ ఎదుట ముఖ్యమంత్రి రోశయ్య, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరవుతారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు దుగ్గల్ సమాధానం దాటవేశారు. కాంగ్రెసు, టీడీపీ నుంచి మూడు ప్రాంతాల ప్రతినిధులు హాజరై తమ వాదనలు వినిపించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులు, సీనియర్ సిటిజన్లు, మేధావులు కూడా వాదనలు వినిపించవచ్చని, సామాజిక, ఆర్థిక, చట్టపరమైన అంశాలను కమిటీ దృష్టికి తీసుకురావొచ్చని చెప్పారు. వచ్చే వారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులు, జూన్ 14న కాంగ్రెసు పార్టీ వాదనలు వినిపించనున్నారని దుగ్గల్ తెలిపారు. కమిటీ సభ్యులు విడివిడిగా, కలిసి జూలైలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో దుగ్గల్‌ తో పాటు సభ్యులు అబూసలే షరీఫ్, రణబీర్‌ సింగ్, రవీందర్‌ కౌర్, నోడల్ అధికారి రాజీవ్‌ శర్మ పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X