ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒంగోలులో ఏడుగురు మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ongole
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో లైలా తుఫాను బీభత్సం సృష్టించింది. పట్టణ శివారులోని వేంకటేశ్వర కాలనీ జలదిగ్భంధం అయింది. ఈ కాలనీలో ఏడుగురు మరణించారు. ఇంతకు ముందు వీరు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. ఒంగోలు పట్టణంలో ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు.

భారీ వర్షాలతో ఒంగోలు సమీపంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. తుఫాను తాకిడి ఒంగోలు పట్టణాన్ని అతలాకుతలం చేసింది. గురువారంనాడు పట్టణం పూర్తిగా నీట మునిగింది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది. ప్రకాశం జిల్లాపై తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉంది. అపారమైన పంట నష్టం సంభవించినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X