రోశయ్యకు ఇక మంచి మార్కులు: చిరు

ఏ విధంగా విజయం సాధిస్తారనే ప్రశ్నపై స్పందిస్తూ తమ వ్యూహాలు తమకున్నాయని, అవి బాహాటంగా చెప్పేవి కావని చిరంజీవి అన్నారు. తన 15 రోజుల పోలవరం యాత్ర అనుకున్న ప్రకారం విజయవంతం అయిందని, ఆరు జిల్లాల్లో 1100 కిలోమీటర్లు పర్యటించానని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో నిర్వాసితులను పరామర్శించి మెరుగైన పరిహారం ఇప్పించేందుకు కృషి చేయాలనుకున్నామని, తుఫాను వల్ల దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నామని అన్నారు. ఈ నెల 26న తలపెట్టిన ఛలో పోలవరం సభనూ వాయిదా వేసుకున్నామని చెప్పారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలుపుతామన్నారు. తమ యాత్ర వల్ల ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, రెండో రోజే రాష్ట్ర ఎంపీలు ప్రధానిని కలిసి చర్చించారని పేర్కొన్నారు. అయితే వారు ఎంత బలంగా వాదించారనేదానిపైన తమకు అనుమానం ఉందన్నారు. తుఫాను వల్ల ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం జరిగిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఎలా ఉన్నా రాజకీయాలకు అతీతంగా సహాయ కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications