వైయస్ పథకాలన్నీ మంచివే: గీతారెడ్డి

మంత్రులందరూ సమర్థవంతంగా పని చేస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో పలు సమస్యలు వచ్చాయని, వైయస్ ఆకస్మిక మరణం, కరవు, వరదలు, తెలంగాణ ఉద్యమం, మత ఘర్షణలు వంటి సమస్యలు వచ్చాయని, వీటి ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడిందని ఆమె అన్నారు. రాష్ట్ర రెవెన్యూ తగ్గిన మాట వాస్తవమేనని, అయితే వైయస్ ప్రవేశపెట్టిన పథకాల అమలులో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని ఆమె అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఎక్కడా దాచి పెట్టడం లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications