నేనలా అనలేదు: నరసింహన్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తాను కేంద్రానికి ఎలాంటి నివేదికలు పంపలేదనీ, అదంతా మీడియా సృష్టేనని అన్నారు. మీడియా సృష్టించిన వివాదానికి తానేం చేయాలని నవ్వుతూ అన్నారు. ఆర్థిక పరిస్థితిపై లేఖలైతే రాశారు కదా? అని ప్రశ్నించినప్పుడు గుర్తు లేదని, అకస్మాత్తుగా ఇటువంటి ప్రశ్నలు వేస్తే తాను చెప్పలేనని ఆయన అన్నారు. ప్రధాన మంత్రిని రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఏమైనా అడుగుతారా? అన్న ప్రశ్నకు ''చూద్దాం. ఏం చర్చకు వస్తుందో ఇప్పటివరకూ ఏమీ తెలియదు'' అని జవాబిచ్చారు. సంక్షేమ పథకాలు కొనసాగించడానికి ఆర్థిక సాయం కోరుతారా? అని అడిగినప్పుడు అది ముఖ్యమంత్రి చెప్పాలని, తాను జోక్యం చేసుకోబోనని అన్నారు. రాష్ట్రంలో నక్సల్ కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వబోమన్నారు.












Click it and Unblock the Notifications