హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కె చంద్రశేఖర రావును ఎక్కడా తిరగనివ్వం: మారెప్ప హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Mareppa
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రను తెలంగాణలో అడ్డుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఎక్కడా తిరగనివ్వమని మాజీ మంత్రి మారెప్ప హెచ్చరించారు. తాను కూడా తెలంగాణ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్నానని, అక్కడే అమీతుమీ తేల్చుకుంటామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టే జగన్ యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రను రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు.

సంక్షేమ పథకాలపై పార్లమెంటు సభ్యుడు మంద జగన్నాథం రాసిన లేఖను ముఖ్యమంత్రి కె. రోశయ్యకు అందజేస్తామని ఆయన చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలను సమీక్షించాలంటున్న నాయకులు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X