సైబర్ నేరంపై సాఫ్ట్ వేర్ ఇంజినీరు అరెస్టు
ఆరు నెలల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం నెట్ బ్యాంకింగ్కు వాడిన ఐపీ (ఇంటర్ నెట్ ప్రొవైడర్) అడ్రస్ ఆధారంగా హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బీఎస్ సాయినాథ్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు. సలావుద్దీన్ కు చెందిన నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్ వర్డ్ లను హ్యాక్ చేసిన సాయినాథ్ రెడ్డి అతని ఆన్ లైన్ అకౌంట్ లోకి చొరబడ్డాడు. చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరుల్లో ఉన్న కొందరు యువకులను మనీమ్యూల్స్ గా (సైబర్ నేరం ద్వారా తమ ఖాతాలోకి వచ్చిన సొమ్మును కొంత కమీషన్ తీసుకుని అసలు నిందితులకు అప్పగించే వారిని సైబర్ పరిభాషలో ఇలా వ్యవహరిస్తారు.) మార్చుకున్నాడు.
కమిషన్ తీసుకుని సాయినాధ్ రెడ్డికి సహకరించిన చెన్నైకు చెందిన సి.శ్రీధర్, బెంగళూరుకు చెందిన ఎస్.అరుణ్ కుమార్, ఆర్.సురేష్ రామ్ దాస్ ను గుర్తించిన సీబీ-సీఐడీ అధికారులు వారిని జనవరి, ఫిబ్రవరి నెలల్లో అరెస్టు చేశారు. సాయినాథ్ ఇచ్చిన 8 నుంచి 10 శాతం కమీషన్ తీసుకుని తమ ఖాతాల్లోకి వచ్చిన మొత్తాన్ని అతనికి అప్పగించినట్లు వారు వెల్లడించారు. దీంతో శనివారం చెన్నై నుంచి హైదరాబాద్ కు చేరుకున్న సీబీ-సీఐడీ ప్రత్యేక బృందం సాయినాథ్ రెడ్డిని అరెస్టు చేసింది.