చిరుతో పొత్తు జగన్ కు చెక్ పెట్టడానికి కాదు: జెసి దివాకర్ రెడ్డి

వైయస్ జగన్ పై చర్య తీసుకోవాలనే కాంగ్రెసు తెలంగాణ నేతల డిమాండ్ తో తాను ఏకీభవించబోనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసులో వాక్ స్వాతంత్ర్యం ఉందని, ఆ వాక్ స్వాతంత్ర్యంతోనే వారు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ఇంద్రుడు, దేవేంద్రుడు అన్న తెలంగాణ నాయకులే ఇప్పుడు ఛీత్కరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓదార్పు యాత్రను కొనసాగించాలా, వద్దా అనేది జగన్ ఇష్టమని ఆయన అన్నారు. చిరంజీవిని మంత్రివర్గంలో చేర్చుకునే విషయంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి రోశయ్య, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీలదే తుది నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికే చిరంజీవితో చేతులు కలుపుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications