ఆత్మరక్షణలో జగన్: చేతులెత్తేసిన కెవిపి రామచందర్ రావు

జగన్ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తమ సూచనలను బేఖాతరు చేస్తూ వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రకు బయలుదేరడాన్ని సహించకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. పైగా, ఓదార్పు యాత్ర పరిణామాలపై ముఖ్యమంత్రి రోశయ్యను కాదని, గవర్నర్ నరసింహన్ ను జగన్ కలవడాన్ని కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. సొంత ప్రభుత్వాన్ని జగన్ నిందించేందుకు పూనుకున్నారని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications