హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

9న ప్రధాని మన్మోహన్ సింగ్ తో చిరంజీవి భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసుతో స్నేహానికి సై అన్న ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఈ నెల 9వ తేదీన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో సమావేశం కానున్నారు. అంతకు ముందు ఈ నెల 7వ తేదీన ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను కలుస్తారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని చిరంజీవి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి మన్మోహన్ సింగ్ తో ఆయన మాట్లాడే అవకాశాలున్నాయి.

అలాగే, ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గంలో చేరేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఆయనకు హోం శాఖను గానీ విద్యాశాఖను గానీ ఇస్తామని కాంగ్రెసు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X