హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేణుకా చౌదరి, డిఎస్ లకు నిరాశ: సింఘీకి మొండిచెయ్యి

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Chowdary
హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థుల ఖరారులో కాంగ్రెసు పార్టీ పాతవారికే ప్రాధాన్యం ఇచ్చింది. అది కూడా పూర్తి విధేయులనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేసింది. జైరాం రమేష్, జెడి శీలం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వి హనుమంత రావుల పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేసి గురువారం రాత్రి ప్రకటించింది. కాగా, వార్త దిన పత్రిక యజమాని గిరీష్ సంఘీకి నిరాశే ఎదురైంది. సంఘీకి టికెట్ ఇవ్వలేదు.

కాగా, రాజ్యసభలో అడుగు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి నిరాశే ఎదురైంది. ఖమ్మం పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఓడిపోయిన తర్వాత ఆమె తిరిగి పార్లమెంటులో కాలు పెట్టడానికి రాజ్యసభ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. ఆమె పేరును అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నప్పటికీ పార్టీ అవసరాల దృష్ట్యా పాత వారికే టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. అదే విధంగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. రేణుకా చౌదరికి, డిఎస్ కు రాజ్యసభ సీట్ల విషయంలో నిరాశే ఎదురైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X