కెవిపి రామచందర్ రావుతో భేటీ: వైయస్ జగన్ ఎడతెగని ప్రయత్నాలు

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వైపు పార్టీ అధిష్టానంతో రాజీకి ప్రయత్నిస్తూనే మరో వైపు శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్యతో కూడా సయోధ్యకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ అధిష్టానంతో రాజీ చేసి, ఓదార్పు యాత్రకు అనుమతి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆయన శుక్రవారం రాజ్యసభ సభ్యుడు, తన తండ్రి ప్రియమిత్రుడు కెవిపి రామచందర్ రావును కలిసినట్లు తెలుస్తోంది. కెవిపితో వైయస్ జగన్ దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. తల్లి విజయమ్మతో కలిసి సోనియాను కలవడానికి అనుమతి ఇప్పించాలని జగన్ కెవిపిని కోరినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి రోశయ్యకు, జగన్ కు మధ్య సయోధ్య కుదర్చడానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం జగన్ ను కలిశారు. ప్రస్తుతానికి ఏదో మేరకు రాజీ పడడమే మంచిదని ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కు చెబుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు జగన్ కోసం ఎదురు చూస్తున్నారంటూ ఆయన టీవీ చానెల్ సాక్షిలో వార్తాకథనం ప్రసారమవుతోంది. శ్రీకాకుళం ప్రజలతో జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ కొంద మంది వ్యక్తులు చెప్పిన విషయాలను సాక్షి టీవీలో ప్రసారం చేస్తున్నారు. దీన్ని బట్టి శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రకు జగన్ పార్టీ అధిష్ఠానం అనుమతి సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+