వైయస్ జగన్ గొడవ: పోయేదేమీ లేదంటున్న సిఎం రోశయ్య
వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణంతో అనూహ్యంగా రోశయ్యను ముఖ్యమంత్రి పదవి వరించింది. తాను ముఖ్యమంత్రి అవుతానని ఏనాడూ ఆయన అనుకోలేదు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అనిపించుకున్న తర్వాత ఈ వయస్సులో ఆయనకు కావాల్సిందేమీ లేదు. ఈ స్థితిలో జగన్ విమర్శలు చేస్తూ తనపై యుద్ధం ప్రకటించినా రోశయ్య చలించడం లేదని అంటున్నారు. పైగా ,తనకు పోయేదేముందని ఆయన తనను కలవడానికి వచ్చిన సన్నిహిత మిత్రులతో, శాసనసభ్యులతో అంటున్నారట.
Comments
Story first published: Friday, June 4, 2010, 16:51 [IST]