హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ గొడవ: పోయేదేమీ లేదంటున్న సిఎం రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కె. రోశయ్యకు నిద్రపట్టకుండా చేస్తున్నారనే అందరూ అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదని ప్రచారం జరుగుతోంది. రోశయ్యను ముప్పు తిప్పలు పెట్టి ఎప్పుడూ దించేద్దామా అని జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఆయన చేసిన ప్రయత్నాలను అన్నింటినీ రోశయ్య కాంగ్రెసు పార్టీ అధిష్టానం అండదండలతో అధిగమిస్తున్నారు. అంతా హైకమాండే చూసుకుంటుందనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణంతో అనూహ్యంగా రోశయ్యను ముఖ్యమంత్రి పదవి వరించింది. తాను ముఖ్యమంత్రి అవుతానని ఏనాడూ ఆయన అనుకోలేదు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అనిపించుకున్న తర్వాత ఈ వయస్సులో ఆయనకు కావాల్సిందేమీ లేదు. ఈ స్థితిలో జగన్ విమర్శలు చేస్తూ తనపై యుద్ధం ప్రకటించినా రోశయ్య చలించడం లేదని అంటున్నారు. పైగా ,తనకు పోయేదేముందని ఆయన తనను కలవడానికి వచ్చిన సన్నిహిత మిత్రులతో, శాసనసభ్యులతో అంటున్నారట.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X