రోశయ్యతో వైయస్ జగన్ రాజీకి ఉండవల్లి మధ్యవర్తిత్వం

ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఓదార్పు యాత్రకు అనుమతి లేదని అధిష్టానం చెప్పిన నేపథ్యంలో జగన్ కు సహకరించడానికి కాంగ్రెసు శాసనసభ్యులు, నాయకులు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్రను రద్దు చేసుకుంటే మంచిదని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రు మురళి జగన్ తో చెప్పినట్లు తెలుస్తోంది. కొండ్రు మురళి జగన్ కు సన్నిహితుడు. అధిష్టానం అనుమతి లేకుండా ఓదార్పు యాత్రకు సహకరించడం కష్టమని ఆయన జగన్ తో అన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ముఖ్యమంత్రితో రాజీ కుదర్చేందుకు జగన్ తరఫున ఉండవల్లి రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications