హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోతే పొమ్మన్న హైకమాండ్: అడకత్తెరలో వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తమ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ మాట వినకుండా వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రకు సిద్ధపడమే కాకుండా ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వంపై విమర్శలు చేయడం అధిష్టానానికి రుచించడం లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అస్థిరం పాలు చేయడానికి ప్రయత్నించడమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు కూడా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ జగన్ కు అధిష్టానం తమ కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి రోశయ్యకు పూర్తి సహకరించాలని, అది ఇష్టం లేకపోతే తన దారి తాను చూసుకోవాలని వైయస్ జగన్ కు అధిష్టానం సూచించినట్లు చెబుతున్నారు. అధిష్టానం మాటపై జగన్ తన అనుచరులుతో చర్చించినట్లు చెబుతున్నారు. అయితే చాలా మంది పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో కొన్ని సాహసాలు కూడదని, తిరుగుబాటులో విఫలమైతే తమ గతేమిటని వారు జగన్ తో అన్నట్లు తెలిసింది. తన వ్యూహం అమలులో విఫలమైతే వ్యాపారాలు చేసుకుంటారు, తాము రాజకీయాలనే నమ్ముకున్నవాళ్లం, వ్యూహం ఎదురు తిరిగితే రాజకీయంగా భవిష్యత్తు శూన్యమవుతుందని అని ఓ నాయకుడు అన్నారు. దీంతో జగన్ రాజీబాటు పట్టినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X