హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్తికరెడ్డిపై ముఖ్యమంత్రి రోశయ్యకు జయసుధ ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayasudha
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కార్తిక రెడ్డిపై సికింద్రాబాద్ కాంగ్రెసు శాసనసభ్యురాలు జయసుధ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఫిర్యాదు చేశారు. ఆమె శనివారం ఉదయం సిఎం క్యాంపు కార్యాలయంలో రోశయ్యను కలిశారు. వార్డు కమిటీ ఎన్నికల్లో కార్తిక రెడ్డి భర్త చంద్రారెడ్డి జోక్యం చేసుకున్నారని, తాను సూచించిన పేర్లను తొలగించి వేరే పేర్లను వార్డు కమిటీలో చేర్చారని ఆమె ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

కాగా, మున్సిపల్ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్తిక రెడ్డికి, జయసుధకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్తిక రెడ్డి తన భర్త చంద్రారెడ్డితో కలిసి శుక్రవారంనాడే ముఖ్యమంత్రి కె. రోశయ్యను, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలుసుకుని వివరణ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X