అసెంబ్లీ ఉప ఎన్నికలు: వేడెక్కుతున్న తెలంగాణ

ఉప ఎన్నికల్లో పోటీ అనివార్యం కావడంతో తెలంగాణ రాజకీయ వేడి ప్రారంభమైంది. కాంగ్రెసు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాజీనామా చేసిన అభ్యర్థులకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులు చైతన్యయాత్ర చేపట్టారు. వీరి బస్సు యాత్ర ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సాగుతుంది. కాంగ్రెసు నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంగిలి మెతుకులకు డిఎస్ ఆశపడుతున్నారని వారు వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణలో వాతావరణం మరింత వేడెక్కే ప్రమాదం ఉంది. ఉప ఎన్నికలు జరిగే 12 స్థానాల్లో పరిస్థితిని అదుపు చేయడం ప్రభుత్వానికి సమస్యగానే మారవచ్చు.












Click it and Unblock the Notifications