చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తూరు జిల్లాలో ఐఎస్ ఐ ఉగ్రవాది కోసం వేట

By Pratap
|
Google Oneindia TeluguNews

Chittoor Dist
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ ఐ ఉగ్రవాది సంచరిస్తున్నాడనే అనుమానంతో కర్నాటక పోలీసులు గాలిస్తున్నారు. అహ్మద్ అనే ఉగ్రవాది వారం రోజుల క్రితం పాకిస్తాన్ కు మెయిల్ పంపినట్లు గుర్తించిన కర్నాటక పోలీసులు తమ గాలింపును ముమ్మరం చేశారు. తమిళనాడులోని వేలూరు రోడ్డులో గల ఓ నెట్ సెంటర్ ద్వారా అహ్మ్దద్ అనే వ్యక్తి ఉగ్రవాద కార్యకపాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు.

వారం రోజుల క్రితం అహ్మద్ స్థానిక నెట్ సెంటర్ లో మెయిల్ ఐడి క్రియెట్ చేసుకున్ని ఐఎస్ఐకి మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. నెట్ సెంటర్ యజమాని పరారీలో ఉన్నాడు. చిత్తూరు జిల్లా పోలీసులు మాత్రం ఉగ్రవాది వ్యవహారంపై తమకు ఏ విధమైన సమాచారం లేదని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X