వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నంలో విషం కలిపి అత్తను చంపిన కోడలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: వరంగల్ జిల్లా ములుగు మండలం ఖాసిమ్ దేవి పేట గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ తన అత్త తినే అన్నంలో విషం కలిపింది. విషం కలిపిన అన్నం తిన్న అత్త కొమరమ్మ మరణించగా, ఆడపడుచు, ఇద్దరు పిలల్లు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

తన కుటుంబ సభ్యులు అన్నంలో కలుపుకునే సాంబారులో ఎండ్రిన్ గుళికలు కలిపినట్లు నిందితురాలు కోమల పోలీసుల ఎదుట అంగీకరించింది. ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితిని 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని వైద్యులంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X