హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెనక్కి తగ్గిన వైయస్ జగన్ : ఓదార్పు యాత్ర వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తన శ్రీకాకుళం ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెనక్కి తగ్గారు. తన యాత్రను నెల రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. వచ్చే నెల 8వ తేదీన తాను ఓదార్పు యాత్రను చేపడతానని ఆయన చెప్పారు. నిజానికి, ఆయన వారం రోజుల పాటు మాత్రమే తన యాత్రను వాయిదా వేసుకోవాలని అనుకున్నారు. అయితే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాందీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ సోమవారం రాత్రి ఫోన్ చేసి జగన్ తల్లి విజయలక్ష్మితో మాట్లాడారు. విజయలక్ష్మి సోనియాకు రాసిన లేఖకు వివరణ ఇవ్వడానికి ఆయన ఫోన్ చేశారు.

ఇప్పట్లో జగన్ ను కలుసుకోవడానికి సోనియా ఇష్టంగా లేరని అహ్మద్ పటేల్ విజయలక్ష్మితో చెప్పారు. ఓదార్పు యాత్రను నిరవధికంగా వాయిదా వేసుకోవడం మంచిదని, ఆ ఊసెత్తక్కపోతేనే మంచిదని ఆయన చెప్పారు. ఈ స్థితిలో కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించుకున్నారు. కుటుంబ సభ్యుల సలహా, ఒత్తిడి మేరకు జగన్ తన యాత్రను వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత బాధితులకు ఓ లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుంటున్నందుకు తనను మన్నించాలని ఆయన ప్రజలను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X