కెవిపి రామచంద్రరావు బినామీ కంపెనీకి పోలవరం పనులు: సోమిరెడ్డి

ఎనిమిది నెలల కిందట పోలవరం పనులకు సవరించిన అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. అయితే ఇందులో మొదటిసారిగా సాగునీటి శాఖకు చెందిన స్పిల్వే, రాక్ ఫిల్ డ్యామ్లతో పాటు జెన్కోకు సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టును కూడా కలిపి ఒకే టెండరు పిలవడం ప్రపంచంలోనే అతి పెద్ద వింత అని అన్నారు. పవర్హౌస్ పనికి టెండర్లు పిలిచి అమలు చేయించే అపారమైన అనుభవం, మౌలిక సౌకర్యాలు జెన్కోకు ఉన్నా, జెన్ కోను విస్మరించారన్నారు. విద్యుత్ ప్రాజెక్టును...జలయజ్ఞంలో భాగంగా జరిగే సాగునీటి పనుల్లో కలిపేశారన్నారు. ఇలా కలిపేసి ఈ రెండు రంగాల్లో అనుభవం ఉన్న ఏకైక కంపెనీకి పనులను ఇచ్చేశారని, కేవీపీ బినామీ కంపెనీ కోసమే ఇలా చేశారని సోమిరెడ్డి తెలిపారు.
విదేశీ కంపెనీతో భాగస్వామ్యం ఉండొద్దంటూ మరొక నిబంధన కూడా పెట్టారని, ఇతర కంపెనీలను టెండరు ప్రక్రియ నుంచి దూరంగా ఉంచేందుకేనని చెప్పారు. ఇటీవల జాతీయ రహదారుల సంస్థ టెండర్లలో తలెత్తిన వివాదంలో ఒక అధికారిని, ఒక కాంట్రాక్టరును జైలుకు పంపారని గుర్తు చేశారు. పోలవరం టెండర్ల విషయంలో సీబీఐ, ఇతర కేంద్ర నిఘా సంస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి నిబంధనలతో ఖరారు చేసిన టెండర్ల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఆలస్యమయ్యే పరిస్థితి కన్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications