వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నాదానికి సీమాంధ్ర నేతలు సై

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: తెలంగాణవాదం విషయంలో కాంగ్రెసు సీమాంధ్ర నేతలు మెతకబడ్డారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో శుక్రవారం సమావేశమైన సీమాంధ్ర నేతలు తమ గొంతు మార్చి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం ప్రారంభించారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలంగాణ నినాదంతో కాకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పోటీ చేయాలని గత కొంత కాలంగా సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి వచ్చిన శ్రీనివాస్ శుక్రవారం సీమాంధ్ర నేతలతో సమావేశమై అధిష్టానం అభిమతాన్ని వివరించినట్లు సమాచారం.

కరుడు గట్టిన సీమాంధ్ర నేతలు శైలజానాథ్, ఆనం వివేకానంద రెడ్డి కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడంలో తప్పు లేదని ఆనం వివేకానంద రెడ్డి తన ఉదారతను చాటారు. తెలంగాణ నినాదాన్ని ఉప ఎన్నికల్లో వాడకూడదని వాదిస్తూ వచ్చిన శైలజానాథ్ కూడా పూర్తిగా మారిపోయారు. ఎన్నికల్లో గెలవాల్సిన అవసరాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను దెబ్బ తీయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలంగాణ నినాదాన్ని వాడాల్సిన అవసరాన్ని డిఎస్ వారికి వివరించినట్లు సమాచారం. దాన్ని అధిష్టానం ఆమోదంగా కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వేర్పాటువాదంలోనూ ఐక్యత చాటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X