హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ యాత్రకు మెలిక: అసెంబ్లీ సమావేశాలపై కినుక

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టడం జగన్ వర్గీయులకు మింగుడు పడడం లేదు. జగన్ యాత్ర వచ్చే నెల 8వ తేదీన ప్రారంభం కావాల్సి ఉండగా, శాసనసభా సమావేశాలను 7వ తేదీ నుంచే నిర్వహించాలని ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే నెల 8వ తేదీన వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగన్ శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రను నిర్వహించాలని తలపెట్టారు. దానికి పార్టీ అధిష్టానం నుంచి అనుమతి రాలేదు. అయితే, అనుమతి రాకున్నా జగన్ యాత్రకు పూనుకోవచ్చుననే అనుమానంతో రోశయ్య మంత్రివర్గం శాసనసభా సమావేశాల మెలిక పెట్టింది.

వైయస్సార్ జయంతిని ఎనిమిదో తేదీన ఘనంగా నిర్వహించాలని తలపెట్టగా శాసనసభా సమావేశాలు నిర్వహించడం ఆటంకంగా మారుతున్నాయని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి అంటున్నారు. ఏడో తేదీన సమావేశాలకు హాజరై ఎనిమిదో తేదీన స్వస్థలాలకు వెళ్లడం సాధ్యం కాదని అంటున్నారు. అలాగే, 8వ తేదీన ప్రభుత్వ పరంగా లేదా పార్టీ పరంగా వైయస్సార్ జయంతి కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఇది కూడా జగన్ వ్యూహానికి విరుగుడుగానే భావించాల్సి ఉంటుంది. కాగా, జగన్ వ్యతిరేకవర్గం శాసనసభ్యులు మాత్రం శాసనసభా సమావేశాల నిర్వహణ తేదీని సమర్థిస్తున్నారు. వైయస్ కు శాసనసభలో 8వ తేదీన ఘనంగా నివాళులు అర్పించడానికి వీలుగానే సమావేశాల తేదీని ఖరారు చేసి ఉంటారని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X