ఆదాయమే గానీ ప్రజలు ఏమైనా ఫరవా లేదా: చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu
విశాఖపట్నం: మద్యం టెండర్లతో వేల కోట్లు సంపాదించిన ప్రభుత్వం ప్రజలు ఏమైనా ఫర్వాలేదన్నట్లు వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. విజయనగరం పర్యటన నిమిత్తం విశాఖపట్నం చేరుకున్న చంద్రబాబు మంగళవారం మీడియా ప్రతినిధులతోమాట్లాడారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మద్యం టెండర్లతో అదనంగా 7 వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని రోశయ్య ప్రభుత్వం చూసుకుంటోందే తప్ప ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదని ఆయన విమర్శించారు.

రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టే ఖరీఫ్‌ సీజన్‌ లో విత్తనాలు, ఎరువులు దొరకడం లేదని అన్నారు. ఆహార భద్రతకు చర్యలు తీసుకోవాలన్న ప్రధాని మన్మోహన్ సింగ్ రైతులకు కనీస మద్దతు ధర కల్పించే ప్రయత్నం చేయడం లేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై మరింత పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని విజయనగరం జిల్లా నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాక్సైట్ తవ్వకాల వ్యవహారంలో గిరిజన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+