హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ వ్యాఖ్యలను మేం పట్టించుకోం: నాగం జనార్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యలను తాము పట్టించుకోమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై పోరాటం చేస్తుంటే కెసిఆర్ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. పార్టీ తెలంగాణ సీనియర్ నాయకుల సమావేశానంతరం ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసా వహిస్తామని ఆయన చెప్పారు. మనసావాచా కర్మణా తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.

తమ వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ ను కెసిఆర్ పార్టీలో చేర్చుకున్నారని ఆయన విమర్శించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేస్తోంది కాబట్టే అనివార్యంగా తాము పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసును పోటీ నుంచి తప్పిస్తే తాము తమ నాయకులను ఒప్పించి పోటీ నుంచి తప్పుకుంటామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో అమర వీరుల కుటుంబాలను పోటీకి దించే విషయంపై చర్చించలేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X