హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు సీట్ల ఎన్నికల వాయిదాపై ఇసికి హైకోర్టు నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు వాయిదా వేయడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) జారీ చేసిన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు బుధవారం ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసింది. సిరిసిల్ల, వేములవాడ స్థానాల ఎన్నికల వాయిదాపై తెరాస మంగళవారం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

తెలంగాణలో 12 శాసనసభా స్థానాలు ఖాళీ కాగా, పది స్థానాలకు మాత్రమే వచ్చే నెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తూ ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. మిగతా రెండు స్థానాలకు ఎన్నికల ప్రకటన చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన తెరాస హైకోర్టును ఆశ్రయించింది. ఆ రెండు స్థానాలకు ఎన్నికలను వాయిదా వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని తెరాస ఫిర్యాదు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X