వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమలలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం, షాపులు దగ్ధం
ఈ శబ్దానికి సమీపంలోని షెడ్డుల్లో నిద్రిస్తున్న వందలాది మంది భక్తులు ఉలిక్కిపడి లేచి భయంతో పరుగులుతీశారు. చిన్న పిల్లలు కేకలు వేశారు. ఈ ఏడాది ఇదే తరహాలో రెండు ప్రమాదాలు జరిగాయి. ఇదే షాపింగ్ కాంప్లెక్స్లో ఫిబ్రవరి 21 తెల్లవారు జామున ప్రమాదం జరుగగా, మరొకటి మార్చి 1న రాత్రి కేంద్రీయ విచారణ కార్యాలయం(సీఆర్వో) ఎదుట దుకాణ సముదాయంలో మంటలు సంభవించి పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ మూడు ప్రమాదాలు కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగాయి. దుకాణదారులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం, తితిదే విద్యుత్ విభాగం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు తరచూ సంభవించడంతో పాటు భక్తులను భయకంపితులను చేస్తున్నాయి.
Comments
Story first published: Thursday, June 24, 2010, 9:21 [IST]