హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి రోశయ్యతో పిసిసి చీఫ్ డిఎస్ కీలక భేటీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ముఖ్యమంత్రి రోశయ్యతో ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ ఉదయం సమావేశమయ్యారు. తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.రోశయ్య ఈరోజు గురువారం సాయంత్రం ఏడు గంటలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో భేటీ కానున్నారు.

గ్రీన్ ల్యాండ్స్ లో ఉన్న క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులపై సీనియర్ల అనుమానాలను నివృత్తి చేయడానికి సీఎం ఈ అంతర్గత సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది.పోలవరం డిజైన్‌ మార్పు అవసరం లేదని పేర్కొంటూ తక్షణ జాతీయ హోదా కోసం కేంద్రానికి రోశయ్య లేఖ రాసినట్లు వార్తలు వెలువడిన తరుణంలో జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నదని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X