తనపై కుట్ర చేస్తున్నారని రోశయ్య సంచలన ఆరోపణ

Rosaiah
హైదరాబాద్‌: కొందరు తనపై కుట్ర పన్ని కావాలని అలజడి సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి రోశయ్య సంచలన ఆరోపణ చేశారు. ఏవేవో ఆలోచనలు చెప్పి ఆందోళన చేయిస్తున్నారని, దానికి కావాల్సిన సరంజామా ఇచ్చి కథ నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఫిల్మ్‌నగర్‌ బస్తీ వాసులతో సమావేశం సందర్భంగా రోశయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. తాజా రాజకీయపరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

తనను అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న భావం రోశయ్య మాటల్లో వ్యక్తమయింది. ముఖ్యమంత్రి నోటి వెంట కుట్ర అనే మాట రావడం పెద్ద విషయంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయన తన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరి పేరును ఉదహరించలేదు. ఉపకార వేతనాలు, బోధన రుసుముల చెల్లింపు విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై ఆయన కొద్దిరోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను బీసీ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నా మంత్రులు సక్రమంగా స్పందించడంలేదని కూడా తప్పుపట్టారు. దాంతో గురువారం బీసీ మంత్రులంతా కలసికట్టుగా విలేకరుల సమావేశం పెట్టి బీసీలకు ప్రభుత్వం ఏం చేస్తోందీ వివరించారు. వై.ఎస్‌ హయాంలోనూ బకాయిలు ఉన్నాయనే వాస్తవాన్ని గణాంకాలతో వారితోనే చెప్పించారు. అదే సమయంలో ఇటు తాను కూడా ప్రత్యక్షంగా విమర్శలకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+