హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తగిన సమయంలో కుట్రదారులను బయటపెడ్తాం: మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sridhar Babu
హైదరాబాద్‌: ఫీజుల చెల్లింపులపై జరిగిన ఆందోళన వెనక కుట్రదారులెవరో సమయం వచ్చినప్పుడు బయటపెడ్తామని ఉన్నత విద్యామంత్రి శ్రీధర్ బాబు, సాంకేతిక విద్యామంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. ఫీజుల చెల్లింపులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పినా రాజకీయం చేశారని వారు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. ఆర్థిక బలంతో కళాశాలలు ప్రభుత్వాన్ని లొంగదీయాలని అనుకోవడం సరి కాదని వారన్నారు. ఉపకార వేతనం, బోధనా ఫీజుల చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి రోశయ్యను కుట్రదారుడిగా చేయడం సరి కాదని వారన్నారు.

విద్యార్థులను చులకనగా చూసే కశాశాలలపై కఠినంగా వ్యవహరిస్తామని వారు హెచ్చరించారు. కళాశాలల పనితీరును సమీపంగా పరిశీలిస్తామని వారు చెప్పారు. బడ్జెట్లో కేటాయించిన ప్రకారమే దఫాలుగా ఫీజులు విడుదల చేస్తున్నామని వారు చెప్పారు. కాగా, ఫీజుల రీయంబర్స్ మెంటుపై ఏర్పడిన మంత్రివర్గ సంఘం బుధవారం సమావేశమైంది. కొత్త విధివిధానాలను కమిటీ నిర్ధారించింది. వాటిని గురువారంనాటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదిస్తారు. లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్న తల్లిదండ్రుల విద్యార్థులకు ఫీజుల రీయంబర్స్ మెంట్ జరిగే ప్రతిపాదనను సంఘం చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X