హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై హైకమాండ్ మాటే నా మాట: బొత్స సత్యనారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్‌: తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన గురువారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలిశారు. రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని ఆయన భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఫీజుల రీయంబర్స్ మెంట్ మార్దదర్శకాలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేద విద్యార్థులకు ఫీజలు రీయంబర్స్ మెంట్ అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. పేద విద్యార్థులకు ఎట్టి పరిస్థితిలోనూ అన్యాయం జరగదని ఆయన చెప్పారు. హుజూరాబాద్ శాసనసభా నియోజక వర్గం అభ్యర్థి ఎంపికపై బొత్స సత్యనారాయణ డి. శ్రీనివాస్ తో చర్చించినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X