హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ, సీమాంధ్ర మంత్రుల మధ్య విభేదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.రోశయ్య అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీమాంధ్ర, తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు పొడసూపాయి. వివిధ అంశాలపై ఇరు ప్రాంతాల మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జూనియర్ లెక్చరర్ల పోస్టులకు హైదరాబాదులో సిటీ జోన్ కింద నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తెలంగాణ మంత్రులు వ్యతిరేకించారు. హైదరాబాద్ ఆరో జోన్ కిందికి వస్తుందని, అందువల్ల సిటీ జోన్ కింద ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వడం సరి కాదని తెలంగాణ మంత్రులు వాదించినట్లు సమాచారం.

హైదరాబాదులోని జూనియర్ లెక్చరర్ల పోస్టులకు జరుగుతున్న రాత పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ మంత్రులు అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణ మంత్రుల వాదనలను సీమాంధ్ర మంత్రులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో మాదిరిగానే హైదరాబాదులో కూడా పరీక్ష జరగాలని, పరీక్షను వాయిదా వేయకూడదని వారు వాదించినట్లు తెలుస్తోంది. అయితే, పరీక్ష వాయిదాకే ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 2014 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చేసిన ప్రకటనను మంత్రి గాదె వెంకటరెడ్డి వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X