వైయస్ జగన్ ఓదార్పు యాత్ర: మొయిలీ చేయి దాటింది

పార్టీలో ఉండదలుచుకుంటే తమ మాట వినాల్సిందేనని జగన్ తో సోనియా చెప్పినట్లు సమాచారం. దీంతో వీరప్ప మొయిలీ జగన్ విషయంపై మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. జగన్ గురించి ఏమీ మాట్లాడకూడదని సోనియా నుంచి అధిష్టానానికి చెందిన నాయకులకు కూడా ఆదేశాలు వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో బుధవారం సాయంత్రం జగన్ యాత్ర గురించి అడిగినప్పుడు వీరప్ప మొయిలీ సమాధానం చెప్పలేదు. జగన్ గురించి అటు గానీ ఇటు గానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. దీన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications