హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓదార్పు యాత్ర చేపట్టేందుకే వైయస్ జగన్ నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: పార్టీ అధిష్టానం అనుమతితో సంబంధం లేకుండా ఓదార్పు యాత్ర చేపట్టేందుకే కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నిర్ణయించుకున్నారు. సోనియాతో భేటీలో ఓదార్పు యాత్రపై ఏమీ మాట్లాడలేదని, అందువల్ల ఓదార్పు యాత్రకు ఆమె అనుమతి నిరాకరించినట్లు కాదని జగన్ వర్గీయులు జోస్యం చెబుతున్నారు. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రను నిర్వహించనున్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్ర కార్యక్రమాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ప్రకటించారు.

అంబటి రాంబాబు చెప్పిన వివరాల ప్రకారం - జగన్ ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయ వెళ్లి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాదు వచ్చి ఏడో తేదీన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైల్లో శ్రీకాకుళం బయలుదేరుతారు. ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత 11 నుంచి 15వ తేదీ వరకు తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X