హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డి శ్రీనివాస్ పై రోశయ్య, సీమాంధ్ర నేతల గుర్రు

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్‌: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తీరుపై ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు సీమాంద్ర నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఎన్నికల ప్రచార సరళి వారికి నచ్చడం లేదు. ఆయన మాటలు వారికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. రోశయ్య తర్వాత తానే ముఖ్యమంత్రిని అంటూ శ్రీనివాస్ చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనను గెలిపిస్తే మంచి స్థానంలో ఉంటానని, ముఖ్యమంత్రిని అవుతానంటూ శ్రీవివాస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చెబుతూ వస్తున్నారు.

కాగా, తెలంగాణపై సీమాంధ్ర నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ ఆ విధంగా మాట్లాడడం సరి కాదని వారు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్ర మంత్రి గాదె వెంకట రెడ్డి వంటి వారు ఇప్పటికే తమ నిరసనను వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, తానే తెలంగాణను తెస్తానని శ్రీనివాస్ నిజామాబాద్ ప్రజలకు చెప్పుకుంటున్నారు. ఆయన రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడడం సరి కాదని సీమాంధ్ర నేతలు అంటున్నారు. అయితే, అది డిఎస్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పిసిసి అధికార ప్రతినిధి పాలడుగు వెంకటరావు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X