హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం రాజును కోర్టుకు తెస్తే ప్రాణాలకే ముప్పు: లాయర్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్‌: సత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్‌ రామలింగరాజు కేసును ఈనెల 5వ తేదీకి వాయిదా వేశారు. శుక్రవారం నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. రామలింగరాజుకు చికిత్స చేస్తున్న నిమ్స్‌ వైద్యుడు డాక్టర్‌ అజిత్‌ దీనికి హాజరయ్యారు. రామలింగరాజుకు తెల్ల రక్త కణాలు పడిపోయాయని దాంతో రోగనిరోధక శక్తి తగ్గిపోయిందని ఆయన తెలిపారు.

రామలింగరాజుకు వైద్యం కొనసాగించే విషయం ఈనెల 14న తరువాత తేలుస్తామన్నారు. దీనివల్ల విచారణలో జాప్యం జరుగుతున్నందున రామలింగరాజును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరపాలని సీబీఐ వాదించింది. రోగనిరోధక శక్తి తగ్గిపోయిన రాజును కోర్టుకు తీసుకువస్తే ఆయన ప్రాణాలకే ముప్పు ఉంటుందని ఆయన న్యాయవాదులు వాదించారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 5వ తేదీకి వాయిదావేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X