హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ యాత్రకు నా అనుమతి అక్కర్లేదు: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు తన అనుమతి అవసరం లేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారుపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చర్చించేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్ తో కలిసి ఢిల్లీకి వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్రకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

శాసనసభా సమావేశాలను వాయిదా వేయాలని చాలా మంది శాసనసభ్యులు కోరుతున్నారు కదా అని మీడియా ప్రతినిధులు అడిగితే, చాలా మంది అంటే ఎంత మంది కోరుతున్నారు, ఎవరెవరు కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు. మీరు ఏదేదో రాస్తారు, వాటికి నన్ను సమాధానం చెప్పమంటారని ఆయన అన్నారు. ఈ నెల 8వ తేదీన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉన్నందున 7వ తేదీ నుంచి తలపెట్టిన శాసనసభా సమావేశాలను వాయిదా వేయాలని కొంత మంది శాసనసభ్యులు కోరారని, అయితే, ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శాసనసభా సమావేశాల తేదీలను ఖరారు చేశామని, వాటిని వాయిదా వేయడం కుదరదని తాను చెప్పానని ఆయన వివరించారు. వైయస్ జయంతికి , శాసనసభా సమావేశాల నిర్వహణకు సంబంధం లేదని ఆయన చెప్పారు.

ఈ నెల 8వ తేదీన శాసనసభలో వైయస్ సేలను గుర్తు చేసుకోవడానికి వీలవుతుందని, సాయంత్రం వైయస్ జయంతి సభ కూడా ఉందని ఆయన చెప్పారు. తాను, పిసిసి అధ్యక్షుడు కలిసి ఉప ఎన్నికల్లో పోటీకి పెట్టాల్సిన అభ్యర్థులపై చర్చించామని, దాన్ని తాము సోనియా గాంధీ ముందు పెడతామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థులుగా పాతవారినే ఎంపిక చేస్తారా అని అడిగితే అది చర్చల తర్వాత తెలుస్తుందని ఆయన సమాధానమిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X