హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిసి నేత కృష్ణయ్య ఆందోళన వెనక వైయస్ జగన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: ఫీజుల రీయంబర్స్ మెంటుపై బిసి సంఘం నాయకుడు ఆర్. కృష్ణయ్య చేపట్టిన ఆందోళన వెనక కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాత్ర ఉందనే ప్రచారానికి బలం చేకూరుతోంది. ఆర్ కృష్ణయ్య ఆమరణ నిరాహార దీక్ష వెనక కుట్ర ఉందని, ముఖ్యమంత్రి కె. రోశయ్యను బిసి వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ ఆందోళన చేయిస్తున్నారని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, మోపిదేవి వెంకట రమణ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆర్. కృష్ణయ్య ఆందోళనకు వైయస్ జగన్ అండదండలు అందించగా ప్రతిపక్షాలు అనివార్యంగా మద్దతు తెలిపాయని భావిస్తున్నారు. ఆర్. కృష్ణయ్య శుక్రవారం వైయస్ జగన్ ను కలిశారు. ఈ భేటీయే కృష్ణయ్య ఆందోళన వెనక జగన్ పాత్ర ఉందనడానికి ఆధారమని అంటున్నారు.

కాగా, జగన్ తో భేటీ అనంతరం కృష్ణయ్య మాట్లాడి వైనాన్ని బట్టి కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు. తన దీక్షకు మద్దతిచ్చినవారందరినీ కలిసి కృతజ్ఞతలు చెప్పాలని అనుకున్నానని, అందులో భాగంగానే తాను జగన్ ను కలిశానని కృష్ణయ్య చెప్పారు. తమ భేటీలో ఏ విధమైన రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన చెప్పారు. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఫీజుల రీయంబర్స్ మెంటుపై కృష్ణయ్య చేపట్టిన ఆందోళనకు జగన్ నేతృత్వంలోని సాక్షి దినపత్రికలో అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. దీక్షకు ముందు ఆర్. కృష్ణయ్యతో సాక్షి టీవీ చానెల్ లో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి కృష్ణయ్య దీక్ష వెనక జగన్ పాత్ర తెలిసిపోతుందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X