హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హేమచందర్ పాండేపై విచారణ జరిపిస్తాం: సబితా ఇంద్రారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేత ఆజాద్ తో పాటు మరణించిన హేమచందర్ పాండ్ జర్నలిస్తా, కాదా అనే విషయంపై విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌తోపాటు మృతి చెందిన హేమచందర్‌పాండే భార్య భవిత రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో సోమవారం కలిశారు. తన భర్తను బూటకపు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రికి వినతిపత్రం సమర్పించారు. పాండేను నాగపూర్‌లో పట్టుకొని ఆదిలాబాద్‌కు తీసుకువచ్చి ఎన్‌కౌంటర్‌ పేరుతో హతమార్చారని భవిత కన్నీరుమున్నీరయ్యారు.

తన భర్త మావోయిస్టు కాదని జర్నలిస్టని వాపోయారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ - హేమచందర్‌ మావోయిస్టని నక్సల్సే ఒక ప్రకటన విడుదల చేశారని అన్నారు. పాండే ఎన్‌కౌంటర్‌లోనే మృతి చెందారని, అది బూటకపు ఎన్‌కౌంటర్‌ కాదని స్పష్టం చేశారు. అయినా హేమచందర్‌ జర్నలిస్టా, కాదా అనే విషయంపై విచారణ జరిపిస్తామన్నారు. నక్సల్స్ జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆమె పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X