యుపిఎ ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోంది: చంద్రబాబు

పేదల పట్ల కాంగ్రెసు ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రజల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. బెల్టు షాపులపై తిరగబడాలని ఆయన మహిళలకు పిలుపునిచ్చారు. అలా తిరగబడే మహిళలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజల ఆదాయం పెరిగి వారి కొనుగోలు శక్తి పెరిగిందనే మంత్రుల మాటలను ఆయన వ్యతిరేకించారు. పేదల కొనుగోలు శక్తి పెరగలేదని, మంత్రులు అవినీతి పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రుల అవినీతి ఆదాయం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని అమీర్ పేటలో ధర్నా చేస్తూ అరెస్టయిన చంద్రబాబు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications