శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పు కోసం కెవిపి రామచందర్ రావు తంటాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
న్యూఢిల్లీ: తన ప్రియమిత్రుడు వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి సంపాదించడానికి రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ఢిల్లీలో తంటాలు పడుతున్నారు. అధిష్టానం అనుమతి లేకుండా జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం కెవిపికి కూడా ఇష్టం లేనట్లు సమాచారం. అయితే, జగన్ మొండిపట్టుతో వ్యవహరిస్తుండడంతో కెవిపి అధిష్టానం అనుమతి సంపాదించడానికి ప్రయత్నించక తప్పడం లేదు. ఆయన ఇప్పటికే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ను, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిశారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు. జగన్ ఓదార్పు యాత్రలో మరో మాట లేదని ఇటీవల బెంగుళూర్ లో మొయిలీ చెప్పారు. మాటి మాటికీ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోదని ఆయన చెప్పారు. కడప పార్లమెంటు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలని సోనియా గాంధీ కూడా జగన్ కు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X