అనుమతి రాకున్నా జగన్ ఓదార్పు షెడ్యూల్ విడుదల
తన పర్యటన సందర్భంగా జగన్ పలు మండల కేంద్రాల్లో, కూడళ్లలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారని ఆయన చెప్పారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా యునజన కాంగ్రెసు అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, జిల్లా కాంగ్రెసు నాయకులు కెఎల్ ప్రసాద్, రత్నాల నర్సింహమూర్తి, ఎం. స్వరూప్, శ్రీనివాస రెడ్డి మధ తదితరులు పాల్గొన్నారు. కాగా, జగన్ ఓదార్పు యాత్రకు మంత్రులు, శాసనసభ్యులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, వారి వారసులు ఈ యాత్రను విజయవంతంగా చేయడానికి కృషి చేస్తున్నారు.
Comments
Story first published: Monday, July 5, 2010, 9:15 [IST]