కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పులివెందుల వైయస్సార్ ఘాట్ వద్ద తండ్రికి వైయస్ జగన్ నివాళి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి మంగళవారం ఉదయం నివాళులు అర్పించారు. ఆయన ఉదయం వైయస్సార్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి తలపెట్టిన ఓదార్పు యాత్రకు ఆయన తండ్రి సమాధి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు అక్కడికి పెద్ద యెత్తున చేరుకున్నారు. జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.

ఆ తర్వాత జగన్ తన నివాసానికి చేరుకుని సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైల్లో హైదరాబాదుకు బయలుదేరుతారు. బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాదు నుంచి ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైల్లో శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరుతారు. పులివెందులలోని జగన్ కార్యక్రమానికి శాసనసభ్యులు కమలమ్మ, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు సురేష్ బాబు హాజరయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X