వైయస్ జగన్ ఓదార్పుయాత్ర మరో రోజు పొడిగింపు

వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా రెండో రోజైన శుక్రవారంనాడు రెండు బాధిత కుటుంబాలను పరామర్శించాల్సి వున్నప్పటికీ ఒక్క కుటుంబానికే పరిమితమయ్యారు. రాత్రి 7 గంటల సమయంలో గార మండలం హుకుంపేట గ్రామానికి చేరుకొని మరువాడ జానకిరాం కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ పది నిమషాలు సమయాన్ని గడిపారు. లక్ష రూపాయలు చెక్కు వున్న కవరును అందజేశారు. రెండో రోజు ఓదార్పు యాత్ర షెడ్యూల్ సమయంకన్నా ఆరు గంటలు ఆలస్యంలో వున్నందున ఎల్ఎన్పేట మండలం యంబరాం గ్రామంలో కిలారి సరస్వతి కుటుంబాన్ని ఓదార్చడం ఈరోజుకు సాధ్యం కాకపోవచ్చని జగన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications